PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క‌ర్నూలు ప్ర‌జ‌ల‌కు మంచి భ‌విష్య‌త్తు అందిస్తా.. టిడిపి ఇంచార్జి టి.జి భ‌ర‌త్‌

1 min read

న‌గ‌రంలోని చాణిక్య‌పురి కాల‌నీలో టి.జి భ‌ర‌త్ భ‌రోసా యాత్ర కార్య‌క్ర‌మం

యువ‌త‌కు ఉద్యోగాల క‌ల్ప‌నే ధ్యేయ‌మ‌న్న టి.జి భ‌ర‌త్

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  క‌ర్నూలు న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు మంచి భ‌విష్య‌త్తు అందించాల‌న్న‌దే త‌న క‌ల అని క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భ‌ర‌త్ అన్నారు. న‌గ‌రంలోని ఏ.క్యాంపు చాణిక్య‌పురి కాల‌నీలో టి.జి భ‌ర‌త్ భ‌రోసా యాత్ర కార్య‌క్ర‌మాన్ని ఆయ‌న చేప‌ట్టారు. ప్ర‌తి ఇంటికీ వెళ్లి ప్ర‌జ‌లను క‌లిసి తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాల‌ని ప్ర‌జ‌ల‌ను కోరారు. ఈ ప్ర‌భుత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో వెన‌క‌బ‌డిపోయింద‌ని.. త‌మ ప్ర‌భుత్వం వ‌స్తే ప్ర‌జ‌ల‌కు సంక్షేమం, అభివృద్ధి ఉంటుంద‌ని తెలిపారు. క‌ర్నూల్లో త‌న‌ను గెలిపిస్తే న‌గ‌ర రూపురేఖ‌లు మారుస్తాన‌ని హామీ ఇచ్చారు. తాను గెల‌వ‌డం వ‌ల్ల అర్హులంద‌రికీ సంక్షేమ ప‌థ‌కాలు అందిస్తాన‌న్నారు. న‌గ‌రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయ‌డంతో పాటు ప్ర‌జ‌ల ఆదాయం పెంచుతాన‌ని హామీ ఇచ్చారు. పారిశ్రామిక‌వేత్త‌గా త‌న‌కున్న అనుభ‌వంతో క‌ర్నూలుకు ప‌రిశ్ర‌మ‌లు తీసుకొచ్చి యువ‌త‌కు స్థానికంగానే ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పిస్తాన‌ని భ‌రోసా ఇచ్చారు. క‌ర్నూల్లో నిరుద్యోగం పెరిగిపోయిన నేప‌థ్యంలో త‌ర‌చూ జాబ్‌మేళాలు నిర్వ‌హిస్తాన‌ని చెప్పారు. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో వ‌ల్ల ప్ర‌జ‌ల‌కు ఎంతో ల‌బ్ది చేకూరుతుంద‌న్నారు. చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి అయితే రాష్ట్రానికి కంపెనీలు త‌ర‌లివ‌స్తాయ‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో కార్పోరేట‌ర్ కైపా ప‌ద్మ‌ల‌తా రెడ్డి, బాబ్జి, చంద్ర మోహన్, వినోద్ చౌదరి, శేఖర్, విజయ్ కుమార్, జవహర్ బాబు, ప్రమోద్, రామకృష్ణ, మల్లికార్జున గౌడ్, ఆనంద్, ఎద్దుపెంట అంజి, నాగన్న, ఆనంద్, షాబానా, మని గౌడ్, మద్దయ్య, అబ్రహం, అనిల్, తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

About Author