PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గిరిజన ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలి

1 min read

వైద్య విభాగాన్ని సందర్శించిన ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి..

వైద్య పరికరాలు, ఇతర సౌకర్యాలు పరిశీలన..

గిరిజన ప్రాంతాల నుండి వచ్చే ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కలగకూడదు

 ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సూర్య తేజ

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా :   ఏలూరులో జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో గిరిజన ప్రాంత ప్రజలకు  ఏర్పాటుచేసిన వైద్య విభాగాన్ని ఐ టి డి ఏ ప్రాజెక్ట్ అధికారి సూర్య తేజ గురువారం సందర్శించి, వార్డ్ నిర్వహణ, సిబ్బంది, వైద్య పరికరాలు, ఇతర సౌకర్యాలను పరిశీలించారు.  ఈ సందర్భంగా ప్రాజెక్ట్ అధికారి సూర్యతేజ మాట్లాడుతూ అత్యవసర పరిస్థితులలో  సుదూర గిరిజన ప్రాంతాల నుండి మెరుగైన వైద్య సేవలకుగాను విచ్చేసే ప్రజలకు సత్వరమే వైద్య సేవలందించేందుకు ప్రత్యేక వైద్య విభాగం ఎంతగానో తోడ్పడుతుందన్నారు. ఈ ప్రత్యేక విభాగంలో మందులకు ఎటువంటి కొరత లేకుండా  పూర్తి స్థాయిలో నిల్వ ఉండేలా చూడాలని,  సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలలన్నారు.   గిరిజన ప్రాంతాల నుండి వచ్చే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా వైద్య సేవలందించాలని ఆసుపత్రి వైద్యులను సూర్యతేజ ఈ సందర్భంగా కోరారు.  ఆసుపత్రి సూపరింటెండెంట్ డా శశిధర్, ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ డా. రాజీవ్, ప్రభృతులు పాల్గొన్నారు.

About Author