PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎన్టీఆర్, వైఎస్ఆర్ కు భారతరత్న ఇవ్వాలి

1 min read

పల్లెవెలుగువెబ్ : ఎన్టీఆర్, వైఎస్ఆర్ కు భారత రత్న ఇవ్వాలని మంత్రి కొడాలి నాని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా పేరు పెట్టిన సీఎం జగన్ కు పాదాభివందనాలు చేస్తున్నట్టు కొడాలి నాని అన్నారు. కృష్ణా జిల్లా గుడివాడలోని ఎన్టీఆర్ విగ్రహానికి ఆయన క్షీరాభిషేకం చేశారు. గుడివాడలో క్యాసినో నిర్వహించామని, 500 కోట్లు వచ్చాయంటూ టీడీపీ నేతలు అల్లరి చేశారని అన్నారు. 50 కేసినోలు ఉన్న గోవాలో ఎన్నివేల కోట్లు రావాలి అని ప్రశ్నించారు. గుడివాడలో తనను ఓడించలేకే అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు.

       

About Author