NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కృష్ణగిరి మండలంలో విస్తృతంగా వికసిత్ భారత్ సంకల్ప యాత్ర 

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: కర్నూలు  జిల్లా,పత్తికొండ నియోజకవర్గం క్రిష్ణగిరి మండలం, కృష్ణగిరి,   ఎరుకల చెరువు గ్రామాలలో బిజెపి ఆధ్వర్యంలో వికషిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం విస్తృతంగా చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ప్రజలకు అందిస్తున్న సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలను తెలియజేస్తూ  ఏర్పాటు చేసిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో భాగంగా కృష్ణగిరి మండల ప్రజలకు  అవగాహన కల్పించారు . ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, బిజెపి పత్తికొండ నియోజకవర్గ కన్వీనర్ రంజిత్ కర్ణి,  వికసిత్ భారత్ కార్యక్రమ  ఇంచార్జి గజ్జల లక్ష్మణ స్వామి, కృష్ణగిరి మండల బీజేపీ అధ్యక్షులు రామలింగ, చైతన్య శర్మ, మురళి కృష్ణ తదితరులు పాల్గొన్నారు . 

About Author