PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దౌలతాపురం రామాలయ నిర్మాణానికి భూమి పూజ

1 min read

– పుణ్యభూమి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కాశీభట్ల సత్య సాయినాథ్ శర్మ
పల్లెవెలుగు వెబ్ కమలాపురం: నియోజక వర్గం చెన్నూరు మండలం దౌలతాపురంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ సీతా రామ లక్ష్మణ ఆంజనేయ దేవతా మూర్తుల ఆలయ నిర్మాణానికి తెలుగు దేశం పార్టీ నేత పుణ్యభూమి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షడు కాశీ భట్ల సత్య సాయినాథ్ శర్మ బుదవారం ఉదయం శంఖు స్థాపన భూమి పూజ చేసారు గ్రామ రామాలయం కమిటీ ఆహ్వానం మేరకు సాయినాథ్ శర్మ గ్రామానికీ విచ్చేసి నూతన దేవాలయ నిర్మాణ కార్యక్రమంలో ముఖ్య అథితిగా పాల్గోన్నారు హాజరైచెన్నూరు మండలం దౌలతాపురంలో శ్రీ రామాలయం కమిటీ ఆహ్వానం మేరకు విచ్చేసి శ్రీ సీతారామలక్ష్మణ సమేత శ్రీ వీరాంజనేయ స్వామి నూతన దేవాలయ నిర్మాణ కార్యక్రమానికి ముఖ్య అథితిగా హాజరై భూమిపూజ చేసారు. ఈ సందర్భంగా గ్రామానికీ విచ్చేసిన సాయినాథ్ శర్మ కు గ్రామస్తులు బాణాసంచా పేల్చుతూ ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సాయినాథ్ శర్మ మాట్లాడుతూ గ్రామంలో రాజకీయాల కు కులమతాలకు అతీతంగా ప్రజలంతా కలసి కట్టుగా ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టడం చాలా అభినందనీయమన్నారు… గ్రామ ఆలయం నిర్మాణం కొసం తన వంతు సహాయం లక్ష రూపాయలు చేస్తానని పుణ్యభూమి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కాశీభట్ల సత్య సాయినాథ్ శర్మ అన్నారు.చెన్నూరు మాజీ సర్పంచ్ పొట్టిపాటి ప్రతాప్ రెడ్డి సాయినాథ్ శర్మ లను గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం లో గ్రామ నాయకులు జనార్ధన్ రెడ్డి, రాజారెడ్డి, తిరుపతి రెడ్డి, అర్జున్ రెడ్డి కుమార్ రెడ్డి, తిరుపాల్ రెడ్డి, నాగ సుబ్బారెడ్డి, గురు మహేశ్వర్ రెడ్డి, నిరంజన్, భాస్కర్, అఖిల్ పరమేష్ కృష్ణ కుమార్, కొండారెడ్డి, ప్రసాద్, సతీష్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

About Author