PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

33/11కే.వి సబ్ స్టేషన్ నిర్మాణానికి భూమి పూజ

1 min read

పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం :  మంత్రాలయం మండల పరిధిలోని సూగూరు, బూదూరు, వి. తిమ్మాపురం, వగరూరు, సౌళ్లహళ్లి, సుంకేశ్వరి, రచ్చమర్రి, మాధవరం గ్రామాలకు గత కొద్ది రోజులుగా విద్యుత్ సరఫరా లో లో వోల్టేజ్ సమస్య ఏర్పడుతుంది. అయితే విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి  విద్యుత్ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో రూ కోటిన్నర వ్యయంతో నూతనంగా సబ్ స్టేషన్ నిర్మాణానికి అనుమతులు వచ్చాయి. సూగూరు గ్రామంలోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వద్ద బుధవారం  టీటీడీ పాలకమండలి సభ్యులు వై. సీతారామిరెడ్డి వైకాపా మండల అధ్యక్షులు జి. భీమారెడ్డి, వైఎస్సార్సీపీ మండల ఇన్ చార్జ్ సి. వి. విశ్వనాథ్ రెడ్డి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. నిర్మాణ పనులు వేగవంతం గా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ను వై. సీతారామిరెడ్డి  ఆదేశించారు. అనంతరం వై. సీతారామిరెడ్డి కి పూలమాల వేసి శాలువ కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ డిఈ లు ఓబులేష్, రాజశేఖర్, ఏడీలు ఎల్లప్ప, శాంతి స్వరూప్, ఏఈ లు గోవిందు, కొండారెడ్డి, శేశన్న, ఉప సర్పంచ్ గోపీ సీనియర్ నాయకులు లక్ష్మయ్య, హానుమంతు, దాసు, వెంకటేష్ ముఖ్య నాయకులు తదితరులు ఉన్నారు.

About Author