NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ

1 min read

– ఎమ్మెల్యే పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: మండలంలోని చిన్నమాచుపల్లి పరిధిలోని రుద్రభారతి పేటలో 30 లక్షల రూపాయలతో సి సి రోడ్ల నిర్మాణానికి గురువారం కమలాపురం శాసనసభ్యులు పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ, రుద్రభారతి పేటలో త్రాగునీటి వసతి, అదేవిధంగా సిసి రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ వంటి మౌలిక వసతులన్నీ కూడా కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు, ఇందులో భాగంగా జనరల్ ఫండ్ ద్వారా 30 లక్షల రూపాయలతో 412 మీటర్లు సిసి రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగిందని ఆయన తెలియజేశారు, రాబోవు రోజులలో 48 వ డివిజన్ శాటిలైట్ సిటీ, భారతి పేట గ్రామాల అభివృద్ధికి మరింత కృషి చేయడం జరుగుతుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు, ఈ కార్యక్రమంలో 49 వ డివిజన్ ఇంచార్జ్ గిండి మధు వర్ధన్ రెడ్డి, బుజ్జిరెడ్డి, యం వెంకటరమణ మాదినేని చంటి, శివ, వెంకటప్ప, కేశవ, నాగ దస్తగిరి, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

About Author