PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీ లక్ష్మీ వెంకటేష్ అతిథి గృహ నిర్మాణానికి భూమి పూజ

1 min read

– రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ దంపతులు

పల్లెవెలుగు వెబ్ కల్లూరు:  కల్లూరు లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ సౌజన్యంతో నూతనంగా నిర్మించనున్న శ్రీ లక్ష్మీ వెంకటేష్ అతిథి గృహ నిర్మాణం పనులకు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ దంపతులు ముఖ్య అతిథులుగా హాజరై భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు .ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ రాజశేఖర్ తో పాటు ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ దంపతులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ దంపతులు ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో శ్రీ లక్ష్మీ వెంకటేష్ అతిథి గృహ నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తున్న రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ దంపతులను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ కులాలకు మతాలకు అతీతంగా కర్నూల్లో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా కల్లూరు లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో నూతన అతిథి గృహ నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందించిన రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్కు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పారిశ్రామికవేత్తగా అలాగే రాజకీయ రంగంలో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని వారు ప్రార్థించారు.

About Author