PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీ సీతారామాంజనేయ స్వామి గుడి నిర్మాణానికి భూమి పూజ

1 min read

– భూమి పూజలో పాల్గొన్న సీనియర్ వైసీపీ నాయకులు కాటసాని ప్రసాద్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : పట్టణంలోని భానుముక్కల అవుకు మెట్ట బిల్డింగ్స్ అర్బన్ కాలనీలో గురువారం శ్రీ సీతారామాంజనేయ స్వామి గుడి నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో సీనియర్ వైసీపీ నాయకులు కాటసాని ప్రసాదరెడ్డి భూమి పూజలో పాల్గొని శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. శ్రీరామనవమి రోజునే శ్రీ సీతారామాంజనేయ స్వాముల గుడి నిర్మాణానికి భూమి పూజ నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. కాలనీలో గుడి నిర్మాణానికి శ్రీకారం చుట్టడం అభినందనీయమని, గుడి నిర్మాణానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో 111 బూత్, 5వ సచివాలయ కన్వీనర్ పోలూరు క్రిష్ణ, తమ్మడపల్లె సర్పంచ్ వెంకట్రామిరెడ్డి, వేములపాడు మాజీ సర్పంచ్ చిందుకూరు సుబ్రమణ్యం, భానుముక్కల సొసైటీ ప్రెసిడెంట్ నీలి శ్రీనివాసులు, ఎంపీటీసీ పోలూరు వెంకటసుబ్బయ్య, మాజీ ఎంపిటిసి ఈసారి ఎల్లయ్య, పుల్లారెడ్డి, కె వెంకటరామిరెడ్డి, డేగల విగ్నేష్, ఆర్ రాజశేఖర్, ఎం మదిలేటి, ఉప్పరి నెహ్రూ, ఎన్ శివప్రసాద్, బీవీ రమణ, చాకలి వెంకటరమణ, చిందుకూరి రమేష్, వర్ర మదన కృష్ణ, దుర్గాప్రసాద్, యాదయ్య, కిషోర్, ఎగ్గోని రవిచంద్ర, పోలూరు దస్తగిరి, ఈడిగ దేవి, సుధాకర్, టి వేణుగోపాల్, చాకలి దస్తగిరి, చాకలి నాగభూషణం, చాకలి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

About Author