PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

19వ వార్డు లో 4 లక్షలతో సి సి రోడ్లకు భూమిపూజ 

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: 15వ ఆర్థిక సంఘంలో నిధులు లేకున్నా గ్రామపంచాయతీ నిధులతోనే పనులను నెట్టుకొస్తున్నామని మాజీ ఎంపీపీ ఎస్ నాగరత్నమ్మ అన్నారు. బుధవారం పత్తికొండ పట్టణంలో 19వ వార్డులో నాలుగు లక్షల వ్యయంతో  మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కొమ్ము దీపిక, గ్రామపంచాయతీ గౌరవ  సలహాదారులు ఎస్ నాగరత్నమ్మ చేతుల మీదుగా భూమి పూజ నిర్వహించారు. 15 ఆర్థిక సంఘం లో నిధులు లేకున్నా  నాగరత్నమ్మ ప్రోత్సాహంతో గ్రామ పంచాయతీలో ఉన్న అరకొర నిధులతోనే సీసీ రోడ్ల నిర్మాణం చేపడుతామని సర్పంచ్ కొమ్ము దీపిక చెప్పారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ, మా  మా కాలనీ ఇంతవరకు ఎవరు పట్టించుకోలేదని నాగరత్నమ్మ చొరవతో మా కాలనీకి సిసి రోడ్లు వేయడానికి ప్రారంభం చేసినందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సోమ శేఖర్ వార్డ్ మెంబర్లు , బండి మస్తాన్వలి, లింగన్న, రంగన్న, షేక్షావలి, హుస్సేన్ బి, మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.

About Author