PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘కొప్పర్తి’ గృహ నిర్మాణానికి భూమిపూజ

1 min read

పల్లెవెలుగు వెబ్​, కడప: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాలలో ఒకటై పేదలందరికీ ఇళ్ల నిర్మాణ పథకానికి సంబందించి పనులు వేగవంతం చేయాలని డిప్యూటీ సీఎం అంజాద్​బాష, నగర మేయర్​ సురేష్​ బాబు సూచించారు. కొప్పర్తి లే అవుట్​లో గృహ నిర్మాణ పనులకు మంగళవారం డిప్యూటీ సీఎం, నగర మేయర్​, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్​ రెడ్డి , డిప్యూటీ మేయర్​ ముంతాజ్​ కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం అంజాద్​ బాష మాట్లాడుతూ పేదవాడికి ఇల్లు నిర్మించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం గృహ నిర్మాణ పథకం అమలు చేస్తోందన్నారు. కార్యక్రమం లో 41వ డివిజన్ ఇంచార్జ్ జమాల్ వల్లి , 47వ డివిజన్ కార్పొరేటర్ పాక సురేష్ , 30 వ డివిజన్ కార్పొరేటర్ షఫీ , 45వ డివిజన్ శ్రీనివాసుల రెడ్డి గారు, 46వ డివిజన్ ఇంచార్జ్ రామచంద్ర రెడ్డి , 49వ డివిజన్ ఇంచార్జ్ మధు మరియు వై.యస్.ఆర్.సి.పి నాయకులు లబ్దిదారులు పాల్గొన్నారు.

About Author