PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎన్నిక‌ల్లో బీజేపీకీ భారీ దెబ్బ‌.. పుంజుకున్న హ‌స్తం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : క‌ర్ణాట‌క మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో బీజేపీకి భారీ దెబ్బ‌ప‌డింది. కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా పుంజుకుంది. 5 కార్పొరేష‌న్లు, 19 మున్సిపాలిటీలు, 34 ప‌ట్ట‌ణ పంచాయ‌తీల్లోని 1185 డివిజన్లు, వార్డులకు జరిగిన ఎన్నికల్లో బీజేపీకి గట్టి ఎదురు దెబ్బలు తగిలాయి. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ 501 వార్డుల్లో విజయకేతనం ఎగురవేయగా.. బీజేపీ 431 వార్డుల్లో మాత్రమే గెలుపొందింది. జేడీఎస్‌ కేవలం 45 వార్డులతో సరిపెట్టుకుంది. ఇండిపెండెంట్లు 207 వార్డుల్లో విజయం సాధించి కింగ్‌ మేక ర్లుగా మారారు. ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దులోని హొసపేటలో ఆమ్‌ ఆద్మీపార్టీ బోణీ చేసింది. ఈ విజయాలతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తుండగా అధికార బీజేపీలో అంతర్మథనం ప్రారంభమైంది.

                                      

About Author