PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బిజినవేములలో వైసీపీకి భారీ షాక్

1 min read

వైసీపీని వీడి బైరెడ్డి సమక్షంలో టీడీపీలోకి చేరిక

టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన బైరెడ్డి

పల్లెవెలుగు వెబ్​ నందికొట్కూరు:   నందికొట్కూరు మండలం బిజినవేముల గ్రామంలో బలమైన సామాజిక వర్గానికి చెందిన యాదవులు వైసీపీ పార్టీని వీడారు. గ్రామానికి చెందిన ఒక వర్గం పెత్తందారీ వ్యవస్థ నచ్చకపోవడంతో దాదాపు 100 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరారు.గురువారం నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సమక్షంలో పట్టణంలోని ఆయన స్వగృహంలో  టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.బిజినేముల గ్రామానికి చెందిన రమేష్ యాదవ్ ,శంకర్ యాదవ్, సుధాకర్, బాలకృష్ణ యాదవ్, మధు యాదవ్, ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే టిడిపి సీనియర్ నాయకులు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి  సమక్షంలో టిడిపిలో చేరారు . వైసీపీకి చెందిన వార్డ్ మెంబర్ యేసు రత్నం   ఇండిపెండెంట్ అభ్యర్థి అఖిల్ ,బాలకృష్ణ యాదవ్. మధు యాదవ్. శంకర్ యాదవ్. శివన్న గౌడ్ హోటల్. రమేష్ యాదవ్. సాంబ. శివ. ముగ్గు సుధాకర్. ఉప్పరి పెద్దబాబు. ఉప్పరి ప్రకాష్. ఉప్పరి చిన్నబాబు. మల్లెపొగు శేఖర్. పగిడ్యాల రంగస్వామి. ట్రాక్టర్ శంకర్. వెంకటేశ్వర్లు. శివన్న. శ్రీరంగాపురం రాజు. సరాపు మల్లయ్య. ఉప్పరి పెద్దరాముడు. అఖిల్. ఖలీల్. సలావుద్దీన్. గరీబ్ బాషా. షబ్బీర్ భాష. పాతకోట సంజన. ఈడిగ సుబ్బరాయుడు. ఆవుల శ్రీను. గొల్ల శ్రీను. తెలుగు రవి. తెలుగు శంకర్. మాబులాల్ మీసేవ కలాం లకు టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  గ్రామంలో కొంతమంది పెత్తందారులు చేసే పెత్తనం నచ్చక పార్టీ మారుతున్నట్లు పేర్కొన్నారు. గతంలో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు గ్రామ అభివృద్ధి కోసం కష్టపడి గ్రామం అభివృద్ధి చేసినందుకు మళ్లీ ఇప్పుడు బైరెడ్డి శభరి నీ నంద్యాల పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా గెలిపించుకుంటే మళ్లీ అభివృద్ధికి పూర్వ వైభవం మళ్లీ వస్తుందని బాలకృష్ణ యాదవ్. మధు యాదవ్. శంకర్ యాదవ్ తెలిపారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ పార్టీ అభ్యర్థులను అత్యధిక భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని అన్నారు.

About Author