PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వెయ్యి కోట్ల బోగస్ బిల్లులు.. అకౌంటెంట్ అరెస్ట్ !

1 min read

పల్లెవెలుగువెబ్ : ముంబయిలో ఓ జీఎస్టీ కన్సల్టెంట్ 1000 కోట్లకు పైగా బోగస్ బిల్లులు జారీ చేశాడు. ఇన్ పుట్ ట్యాక్స్ క్రెడిట్లో రూ.181 కోట్ల మేర మోసానికి పాల్పడ్డాడని జీఎస్టీ అధికారులు తెలిపారు. నిథిలన్ ఎంటర్ ప్రైజస్ సంస్థ వస్తువులు, సేవలకు సంబంధించి రసీదులు లేకుండా బోగస్ బిల్లులను సృష్టించినట్టు అధికారులు గుర్తించారు. నిందితుడిని స్థానిక కోర్టులో హాజరుపరచగా 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. నిందితుడు తన పేరు బయటికి రాకుండా వేరొకరి గుర్తింపుతో జీఎస్టీ మోసాలకు పాల్పడినట్టు తేల్చారు.

     

About Author