PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

12 మందిపై బైండోవర్ కేసులు

1 min read

పల్లెవెలుగు వెబ్​, మహానంది:మహానంది సమీపంలోని తెలుగు గంగ కాలువ ఆనుకొని ఉన్న చెంచుగూడెం నకు చెందిన 12 మందిపై బైండోవర్  కేసులు నమోదు చేసినట్లు మహానంది ఎస్సై నాగార్జున రెడ్డి తెలిపారు .గత కొన్ని నెలల క్రితం ప్రభుత్వం 30 మందికి ఇంత భూమిని మంజూరు చేస్తూ పట్టాలు ఇవ్వడం జరిగిందని మరికొందరు దానిని అనుకున్న ప్రాంతాన్ని చదును చేయడంతో అక్కడ వివాదం నెలకొనడంతో బైండోవర్  నమోదు చేశామన్నారు  .వీరిని మండల తాసిల్దార్ జనార్దన్ శెట్టి ముందు ప్రవేశపెట్టమన్నారు .దీనిపై తాసిల్దార్ మాట్లాడుతూ అందరూ కలిసిమెలిసి జీవించాలని ఏవైనా భూ సమస్యలు ఉంటే ఫారెస్ట్ అధికారులతో చర్చించి వారి సూచనల ప్రకారం ఫారెస్ట్ భూమిలో సాగు చేసుకోవచ్చని సమస్య జట్టిలమైతే చర్యలు ఉంటాయని హెచ్చరించినట్లు తెలిపారు చెంచుల వద్ద విల్లంబులు ఉంటే సీజ్ చేయాలని పోలీసులను ఆదేశించినట్లు తెలిపారు .పూచికత్తు  పై విడుదల చేసినట్లు పేర్కొన్నారు.

About Author