NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా ఏపీ జెఎసి అమరావతి జిల్లా చైర్మన్ జన్మదిన వేడుకలు..

1 min read

– ఆయురారోగ్యాలతో ఉండాలని పలువురు ఆశీస్సులు..

పల్లెవెలుగు వెబ్ ఏలూరు :  విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తూ  దానిలో భాగంగా  తోటి ఉద్యోగుల సమస్యలపై కృషి చేస్తున్న ఏపీ జెఎసి అమరావతి జిల్లా చైర్మన్ కె రమేష్ కుమార్ జన్మదిన వేడుకలు గురువారం ఉదయం రామచంద్రరావు పేట  రెవెన్యూ భవన్ నందు తోటి ఉద్యోగులు, మిత్రులు, శ్రేయోభిలాషుల మధ్య ఘనంగా జరిగాయి. అనంతరం కేకు కట్ చేసి పలువురు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని పలువురు స్వయంగా విచ్చేసి మరియు చరవాణిల ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. శాలువా కప్పి బొకేలు అందించి కేకును తినిపించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా  జర్నలిస్ట్ లు ఆయనకు ప్రత్యేక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

About Author