NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మానసిక వికలాంగుల మధ్య పుట్టినరోజు వేడుకలు

1 min read

పల్లెవెలుగు వెబ్ మహానంది:  మండలంలోని సెయింట్ జోసెఫ్ పాఠశాలలోని మానసిక వికలాంగుల విద్యార్థుల మధ్య శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను పార్టీ కార్యకర్తలు ఆదివారం జరుపుకున్నారు. మండలంలోని గోపవరం గ్రామానికి చెందిన నంద్యాల పార్లమెంటు తెలుగు యువత అధ్యక్షుడు చింతం క్రాంతి కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో మానసిక వికలాంగుల మధ్య మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు.. కార్యక్రమంలో భాగంగా కేకును కట్ చేసి మానసిక వికలాంగుల విద్యార్థులకు పంచిపెట్టారు. వీరి మధ్య మాజీ ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందని క్రాంతి కుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author