PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మంత్రి బుగ్గన‌కు చేదు అనుభ‌వం.. వెన‌క్కి నెట్టిన సిబ్బంది

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కు చేదు అనుభ‌వం ఎదురైంది. కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్ రెండు రోజుల ప‌ర్యట‌న నిమిత్తం ఏపీకి వచ్చారు. తిరిగి వెళ్లే స‌మ‌యంలో ప్రోటోకాల్ ప్రకారం ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వీడ్కోలు చెప్పేందుకు వెళ్లారు. అయితే.. తిరుపతి ఎయిర్ పోర్టు లోప‌లికి వెళ్తున్న బుగ్గన రాజేంధ్రనాథ్ రెడ్డిని భ‌ద్రతా సిబ్బంది లోప‌లికి వెళ్లకుండా అడ్డుకున్నారు. వీఐపీ గేటు వ‌ద్ద మంత్రి లోప‌లికి ప్రవేశించే ప్రయ‌త్నం చేయ‌డంతో.. అక్కడి సిబ్బంది మంత్రిని బ‌ల‌వంతంగా వెన‌క్కినెట్టారు. దీంతో మంత్రి కింద‌ప‌డిపోయే ప‌రిస్థితి నెల‌కొంది. దీంతో మంత్రి బుగ్గన ఆగ్రహం వ్యక్తం చేశారు. త‌న‌ను అడ్డుకున్న సిబ్బంది వివ‌రాలు ఇవ్వాల‌ని ఎయిర్ పోర్టు అధికారుల‌ను కోరారు. ఎయిర్ పోర్ట్ అధికారులు స‌ర్దిచెప్పే ప్రయ‌త్నం చేశారు. దీంతో తిరుపతి విమానాశ్రయంలో గంద‌ర‌గోళం నెల‌కొంది.

About Author