PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆత్మ‌కూరు దాడి పై బీజేపీ ఆగ్ర‌హం.. కేంద్రానికి ఫిర్యాదు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : క‌ర్నూలు జిల్లా ఆత్మ‌కూరులో బీజేపీ నేత‌ల పై జ‌రిగిన దాడిని ఆ పార్టీ తీవ్రంగా ప‌రిగ‌ణిస్తోంది. పోలీసుల సమక్షంలో తమ పార్టీ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులపై దాడి జరగడాన్ని జీర్ణించుకోలేకపోతోంది. నిషేధిత సంస్థకు చెందిన వ్యక్తులే బీజేపీ నేతలపై దాడి చేశారని ఆరోపిస్తోంది. రక్షణ కోరుతూ పోలీసు స్టేషన్‌కు వెళితే ఏకంగా స్టేషన్‌పైనే దాడి చేయడం ఉగ్ర చర్యగా అభివర్ణిస్తోంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుతోపాటు పలువురు నేతలు ఆత్మకూరు అంశంపై కేంద్రానికి ఫిర్యాదు చేశారు. అక్రమంగా నిర్మిస్తూ, ప్రశ్నించిన వారిని తరుముతూ, స్టేషన్‌లో దాక్కున్నా దాడి చేయడంపై మండిపడుతున్నారు.

                             

About Author