NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

`హ‌నుమాన్` ఇంటిని బీజేపీ త‌గ‌ల‌బెట్టింది !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ‘హనుమాన్’ ఇంటిని బీజేపీ తగులబెట్టిందని ఆర్జేడీ నేత తేజ‌స్వీ యాద‌వ్ ఆరోపించారు. ఎల్‌జేపీ వ్యవస్థాపకుడు దివంగత రామ్‌విలాస్ పాశ్వాన్‌ బీజేపీకి అన్ని వేళలా మద్దతుగా నిలిచారని, ఆయన బీజేపీకి హనుమంతుడి వంటివారని పేర్కొన్నారు. దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలోని బంగళా నుంచి లోక్ జన శక్తి పార్టీ ఎంపీ చిరాగ్ పాశ్వాన్‌ను ఖాళీ చేయించడంతో రాష్ట్రీయ జనతా దళ్ నేత తేజస్వి యాదవ్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. బీజేపీకి మద్దతివ్వడం వల్ల ఎదురయ్యే ఫలితాలు ఇవేనని చెప్పారు. బీజేపీ ఇప్పటికే ఎల్‌జేపీని ముక్కలు చేసిందని, నేతలను విడదీసిందని అన్నారు.

                                            

About Author