PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జాతీయ జెండా పై బీజేపీ చీఫ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : జెండాల అంశంపై బీజేపీ చీఫ్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. జాతీయ జెండాలు పెట్టుకోని ఇళ్లను ఫొటో తీయాలంటూ.. ఉత్తరాఖండ్ బీజేపీ చీఫ్ మహేంద్ర భట్ వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదంగా మారింది. అయితే, దీనిపై సర్వత్రా విమర్శలు రావడంతో ఆయన మాట మార్చారు. ఈ క్రమంలో ఎవరినీ అనుమానించడం తన ఉద్దేశం కాదంటూ చెప్పుకొచ్చారు. అయితే, మహేంద్ర భట్ ఈనెల 10వ తేదీన హల్ద్వానీలో హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఇళ్లపై పెట్టుకోని వారిని నమ్మవద్దన్నారు. అలాంటి ఇళ్లను ఫొటో తీసి తనకు ఇవ్వాలని పార్టీ కార్యకర్తలతో చెప్పారు. జాతీయ జెండాను ఇంటిపై ఉంచితేనే దేశ భక్తి ఉన్నట్లుగా, లేకపోతే దేశంపై వారికి నమ్మకం లేదు అంటూ.. ఆయన కామెంట్స్‌ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో ఆయనపై తీవ్ర విమర్శలు వచ్చాయి.

                                             

About Author