NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పల్లెవెలుగు వెబ్​ : త్రిపుర స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. స్థానిక సంస్థల్లో మొత్తం 334 స్థానాలకు గాను 329 చోట్ల విజయఢంకా మోగించింది. త్రిపుర రాజ‌ధాని అగర్తలా మునిసిపల్‌ కార్పొరేషన్ లోని మొత్తం 51 స్థానాలతోపాటు… రాష్ట్రంలోని 13 స్థానిక సంస్థలు కైవసం చేసుకుంది. ఏఎంసీ లో ప్రతిపక్ష టీఎంసీ, సీపీఎం పార్టీ అనూహ్యంగా ఒక్క సీటు దక్కించుకోలేకపోయాయి. ఇంకా, ఖొవాయ్, బెలోనియా, కుమార్‌ఘాట్, ధర్మానగర్, తెలియమురా మున్సిపల్‌ కౌన్సిళ్లతోపాటు సబ్రూమ్‌ నగర్, అమర్‌పూర్‌నగర్‌ తదితర పంచాయత్‌లలో బీజేపీ క్లీన్‌స్వీప్‌ చేసిందని ఎన్నికల కమిషన్‌ అధికారులు తెలిపారు. న‌వంబ‌ర్ 25న స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు జ‌ర‌గ్గా.. ఆదివారం ఫ‌లితాలు వెల్ల‌డ‌య్యాయి.

https://ssl.gstatic.com/ui/v1/icons/mail/no_photo.pngReplyForward

About Author