NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను బీజేపీ నాశ‌నం చేస్తోంది !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : పాలు, పెరుగు వంటి ప్రీ ప్యాకేజ్డ్‌, లేబుల్డ్‌ ఆహార పదార్థాలపై జీఎస్టీ విధింపు నేపథ్యంలో కేంద్రంపై విపక్షాలు విరుచుకుపడ్డాయి. అధిక పన్నులు, నిరుద్యోగ సమస్య పట్ల కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మండిపడ్డారు. ప్రపంచంలో శరవేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థను బీజేపీ నాశనం చేస్తోందని ఆయన ఆరోపించారు. పెరుగు, పన్నీరు, బియ్యం, గోధుమ, బార్లీ, బెల్లం, తేనెపై ఏవిధంగా పన్ను విధిస్తున్నది తెలియజేసే గ్రాఫ్‌ను ఆయన ట్విటర్‌లో షేర్‌ చేశారు. ప్రజలు విరివిగా వినియోగించే వీటిపై ఇంతకు ముందు ఎలాంటి పన్ను లేదన్నారు.

                                                  

About Author