PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బీఆర్ఎస్ లోకి బీజేపీ నేత !

1 min read

పల్లెవెలుగువెబ్ : మునుగోడు ఉప ఎన్నిక ముందు బీజేపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఆ పార్టీ నుంచి ఇప్పటికే ఇద్దరు నేతలు శ్రవణ్‌ కుమార్, స్వామి గౌడ్ బయటకు వచ్చి టీఆర్ఎస్‌లో చేరగా మరో నేత చేరికకు రంగం సిద్ధమైంది. బీజేపీ నేత, మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ నిన్న ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్‌పై రాపోలు ప్రశంసలు కురిపించారు. చేనేత రంగాన్ని బీజేపీ నిర్వీర్యం చేస్తుంటే కేసీఆర్ మాత్రం చేనేత రంగ అభివృద్ధికి, కార్మికుల సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలు భేష్ అని కొనియాడారు.

About Author