PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బీజేపీ ఓడిపోతుంది !

1 min read

పల్లెవెలుగువెబ్ : ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార భారతీయ జనతా పార్టీ ఓడిపోతుందని రాష్ట్రీయ జనతా దళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. బీజేపీ ప్రచారం విని విని యూపీ ప్రజలు అలసిపోయారని.. ఇక బీజేపీని అధికారం నుంచి దింపేయడానికి సిద్ధమయ్యారని ఆయన అన్నారు. మంగళవారం పాట్నాలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ లాలూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘బీజేపీ ఎంతసేపూ అల్లర్లు, మతం, గుళ్లు వంటి వాటి గురించే మాట్లాడుతుంది. పేదలు, అవసరాలు, ఉద్యోగాలు, రైతులు, విద్య, వైద్యం లాంటి విషయాలపై అసలే మాట్లాడదు. బీజేపీ ప్రచార ఆర్భాటాలు విని విని యూపీ ప్రజలు అలసిపోయారు. బీజేపీని అధికారం దింపేయాలని వారు అనుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుంది’’ అని లాలూ అన్నారు.

      

About Author