NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రాజ‌ధాని పై స్ప‌ష్ట‌త‌నిచ్చిన బీజేపీ ఎంపీ జీవీఎల్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : రాష్ట్ర రాజధాని అమరావతి, ఎన్నికల్లో పొత్తుల అంశంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర రాజధాని అమరావతికి బీజేపీ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. రాజకీయంగా తమ నిర్ణయానికి వ్యతిరేకంగా వెళ్లినప్పుడు తాము పోరాడుతామని తెలిపారు. ఆంధ్రాలో వైసీపీ పాలన అధోగతిలో ఉందని.. రెండు తెలుగు రాష్ట్రాలపై బీజేపీ ప్రత్యేక శ్రద్ద పెట్టిందని అన్నారు. ఏపీలో బీజేపీ, జనసేన పొత్తుతో ఉందని.. తామే రాష్ట్రంలో ప్రత్యామ్నాయగా ఎదుగుతామని స్పష్టం చేశారు. జనసేన, బీజేపీల మధ్య సయోధ్య ఉంది… అవగాహన ఉందని ఎంపీ జీవీఎల్ పేర్కొన్నారు.

                                                

About Author