NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

స్టేజ్ పైనే చెంప ప‌గ‌ల‌గొట్టిన బీజేపీ ఎంపీ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఓ బీజేపీ ఎంపీ స్టేజ్ పైనే రెజ్ల‌ర్ చెంప ప‌గ‌ల‌గొట్టాడు. ఝార్ఖండ్ రాజధాని రాంచీలో జరుగుతున్న అండర్-15 జాతీయ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌‌కు హాజరైన యూపీ బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ వేదికపైనే ఓ రెజ్లర్ చెంప పగలగొట్టారు. అప్పటికీ ఆగ్రహం చల్లారకపోవడంతో అతడిపైకి దూసుకెళ్లారు. దీంతో అక్క‌డున్న‌వారు ఎంపీని అడ్డుకున్నారు. ఓ యువకుడు స్టేజిపైకి వచ్చి ఆడేందుకు తనను అనుమతించాలని ఎంపీని వేడుకున్నాడు. 15 ఏళ్ల వయసు పరిమితి దాటిపోవడంతో నిర్వాహకులు అతడిని ఆడేందుకు అనుమతించలేదు. దీంతో అతడు నేరుగా స్టేజిపైకి వెళ్లి తనను అనుమతించాలని ఎంపీని పదేపదే విజ్ఞప్తి చేశాడు. దీంతో సహనం కోల్పోయిన ఎంపీ బ్రిజ్‌భూషణ్ అందరి ముందే అతడి చెంపలు వాయించాడు. ఎంపీ తీరు పై రెజ్ల‌ర్లు మండిప‌డ్డారు. క్ష‌మాప‌ణ చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

                                   
             

About Author