PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘ జై భీమ్’ చిత్రం పై బీజేపీ సెటైర్లు !

1 min read

పల్లెవెలుగు వెబ్​: హీరో సూర్య న‌టించిన ‘జై భీమ్’ చిత్రం సంచ‌ల‌న విజ‌యం సాధించింది. ప్రతి ఒక్కరి నుంచి సినిమాకు మంచి టాక్ వ‌స్తోంది. ప‌లువురి నుంచి విమ‌ర్శలు కూడ వ‌స్తున్నాయి. హీరో సూర్యపై బీజేపీ జాతీయ కార్యదర్శి హెచ్‌. రాజా సెటైర్లు వేశారు. మన పిల్లలకు మూడు భాషలు వద్దంటూ వ్యాఖ్యలు చేసిన హీరో ఇపుడు తన సినిమాను ఏకంగా ఐదు భాషల్లో విడుదల చేశారంటూ విమర్శించారు. ఇలాంటి స్వార్థపరులను ఎలా అర్థం చేసుకోవాలంటూ హెచ్‌. రాజా తన ట్విట్టర్‌ ఖాతాలో ట్వీట్‌ చేశారు. దీనికి హీరో సూర్య సైతం లైక్‌ చేయడం విశేషం. ఈ చిత్రాన్ని చూసిన ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌, ఎంఎన్‌ఎం అధినేత కమల్‌ హాసన్‌ మెచ్చుకుంటూ వేర్వేరు ప్రకటనల్లో చిత్ర బృందాన్ని అభినందించిన విషయం తెలిసిందే.

About Author