PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలను ఎండ కట్టండి-సిపిఎం 

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ:   కార్పొరేట్ అనుకూల ప్రజా వ్యతిరేక నిరంకుశ మతోన్మాద బిజెపిని గద్దె దించుదామని, భారతదేశాన్ని కాపాడుకుందామని సిపిఎం జిల్లా నాయకులు బి వీర శేఖర్ మండల నాయకులు మహబూబ్ బాషా లు పేర్కొన్నారు.శుక్రవారం కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టే ప్రచారంలో భాగంగా మండలంలోని కరివేముల పాలకుర్తి , తేర్న్ కల్ గ్రామంలో ప్రచారాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా డివైఎఫ్ఐ నాయకులు కుంకనూరు శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు బి. వీర శేఖర్ ,బిజెపి విధానాల వల్ల దేశంలోని ప్రజలు కార్మికులు రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటుంటే  రాష్ట్రంలోని అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం జనసేన ప్రశ్నించకుండా మెతుక వైఖరి అవలంబించడం వల్ల రాష్ట్రానికి తీవ్రమైన నష్టం జరుగుతుందని ఆరోపించారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన వాటా రాబట్టడంలో, కేంద్ర ప్రభుత్వము  పై ఒత్తిడి  తీసుకురావడంలో రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు వైఫల్యం చెందుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఎం సీనియర్ నాయకులు బజారి గాజుల శ్రీనివాసులు కెపి రాముడు లక్ష్మిరెడ్డి ఆ పార్టీ నాయకులు రాజశేఖర్ రెడ్డి, శాంతిరాజు పేతురయ్య రాముడు తదితరులు పాల్గొన్నారు.

About Author