PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మండలంలో  బిజేపీ “ప్రజాపోరు “కార్యక్రమం

1 min read

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన పథకాలను వైకాపా ప్రభుత్వం చేస్తున్నట్టు ప్రచారం చేస్తున్నారని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు వంగల శశిభూషణ్ రెడ్డి అన్నారు,గురువారం మండల అధ్యక్షులు గాడి భాస్కర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి మాతృ వందన యోజన పథకం కింద అంగన్వాడికేంద్రాలకు సరుకులు 5000, చనుబాలు ఇవ్వడం సమయంలో నిర్దిష్ట పౌష్టికాహారం కింద 6000, పీఎం ఆవాస్ యోజన పథకం ( అర్బన్) కింద ప్రతి పేదవాడు ఇంటి నిర్మాణం కోసం 1,80,000 ఇవ్వడం జరుగుతుందని తెలిపారు, అంతేకాకుండా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద 6000 రూపాయలు, ఉజ్వల యోజన పథకం కింద 31.5 కోట్ల మందికి ఎల్పిజి గ్యాస్ కనెక్షన్లు, 26 కోట్లకు పైగా ఆయుష్మాన్ కార్డులు మంజూరు చేయడం జరిగింది,మేక్ ఇన్ ఇండియా తో మెట్రో రైలు,దేశంలో 20 నగరాలలో 878మెట్రో నెట్వర్క్ వినియోగంలో ఉంది. 80 కోట్ల మందికి ఆహార భద్రత కింద ప్రతినెలా ఉచిత బియ్యం అందించబడుతుంది. ప్రజలు ఇవన్నీ గమనించి 5 ఎన్నికల్లో బిజెపి పార్టీని అత్యంత భారీ మెజార్టీతో గెలిపించాలని ఇంకోసారి ప్రధానమంత్రిగా మనం నరేంద్ర మోడీ ని గెలిపించాలని ఆయన పేర్కొన్నారు,ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు శశిభూషణ్ రెడ్డి,లక్ష్మీనారాయణ, గాలి హరిప్రసాద్, శ్రీనాథ్ రెడ్డి,చంద్రమోహన్ రెడ్డి,భరత్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి రామసుబ్బయ్య ముకుంద రెడ్డి ,అధికారి రవి శివారెడ్డి, గోదిన గంగాధర్, కాశి తదితరులు పాల్గొన్నారు.

About Author