PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బీజేపీ విజయోత్సవ సంబరాలు…

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం సాధించడం పట్ల ఆదివారం కర్నూలు నగరంలోని జిల్లా పార్టీ కార్యాలయం ఎదుట ఆ పార్టీ నాయకులు విజయోత్సవ సంబరాలు చేసుకున్నారు. బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పొలంకి రామస్వామి సీనియర్ నాయకులు  పూలరంగస్వామి ఆధ్వర్యంలోభారీగా బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో 4రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో మూడు రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్గడ్ లో బీజేపీ ఘన విజయం సాధించడం, తెలంగాణలో మెరుగైన ఫలితాలు సాధించడం సంతోష దాయకమన్నారు. ఈ విజయం  ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వం పట్ల ప్రజలకున్న నమ్మకాన్ని తెలియజేస్తోందన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో దేశంలో బీజేపీ నరేంద్ర మోడీ నాయకత్వంలో మూడవసారి ఘన విజయం సాధించడం తథ్యమన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి కౌనున్య రాఘవులు, సీనియర్ నాయకులు సందడి సుధాకర్, మదన మోహన్ ఆచారి, రాఘవేంద్ర, కందుకూరి సూర్య కుమార్, మహిళ మోర్చా అధ్యక్షరాలు మాలాతి, మైనారిటీ నాయకులు హవిలన్ బాబు, త్రివిక్రమ్, యువమోర్చ నాయకులు కటిక ప్రసాద్, నాయకులు పాల్గొన్నారు.

About Author