NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నల్లచట్టాలను రద్దు చేయాల్సిందే..!

1 min read

– సీపీఐ పట్టణ కార్యదర్శి కృష్ణమూర్తి
పల్లెవెలుగు వెబ్​, ఆస్పరి: రైతులకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన వ్యవసాయ నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలని సీపీఐ పట్టణ కార్యదర్శి కృష్ణమూర్తి డిమాండ్​ చేశారు. శనివారం స్థానిక సీపీఐ కార్యాలయం ముందు రైతు వ్యతిరేక నల్ల చట్టాల పత్రాలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం వ్యవసాయ నల్లచట్టాలను తీసుకొచ్చి.. నేటికి ఏడాది అయిన సందర్భంగా చట్టాలకు సంబంధించిన పత్రాలను దగ్ధం చేశారు. కేంద్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరి కారణంగా ఇప్పటి వరకు సుమారు 500 మంది రైతులు చనిపోయారని, అందుకే దేశ వ్యాప్తంగా రైతులు ఆందోళన చేపట్టారన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి నల్లచట్టాలను రద్దు చేయాలని డిమాండ్​ చేశారు. ఈ కార్యక్రమంలో హమాలీ సంఘం అధ్యక్షులు హనుమంతు. రామాంజనేయ ఆంజనేయులు, నాగార్జున, వీరేశ్, గోవిందు , అక్బర్ తదితరులు పాల్గొన్నారు.

About Author