PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్ర‌ధాని పై దైవ దూష‌ణ కేసు .. !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ పై దైవ‌దూష‌ణ కేసు న‌మోదైంది. ఆయ‌న‌తోపాటు మరో ఐదుగురిపై కేసు నమోదయ్యింది. పాక్ ప్ర‌ధాని షెహ‌బాజ్ గతవారం సౌదీఅరేబియా పర్యటనకు వెళ్లారు. ముస్లీంలకు మక్కా తర్వాత అత్యంత పవిత్రమైన స్థలం మదీనాలోని మసీదును సందర్శించారు. అయితే ఈ సమయంలో ఇమ్రాన్ ఖాన్‌ మద్ధతుదారులు కొంతమంది ప్రధాని షాబాజ్ షరీఫ్‌తోపాటు ఆయన బృందానికి వ్యతిరేకంగా మసీదులో పరుష పదజాలాన్ని వాడారు. దొంగలు, కుట్రదారులు అంటూ నినాదాలు చేశారు. అక్కడితో ఆగకుండా నేరపూరిత భాష ఉపయోగించారు. దీంతో ఇమ్రాన్ ఖాన్‌తోపాటు పాక్ మాజీ అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ రషీద్, ఇమ్రాన్ వద్ద చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా పనిచేసిన షాబాజ్ గిల్‌తోపాటు ఇతరులపై పాక్‌లోని ఫైసలాబాద్‌లో దైవదూషణ కేసు నమోదయ్యింది.

                               

About Author