PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని ఆశీర్వదించండి 

1 min read

పల్లెవెలుగు వెబ్  చెన్నూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించి ఆయనను మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని చింతకొమ్మదిన్నె జెడ్పిటిసి యువ నాయకులు నరేన్ రామాంజనేయులు రెడ్డి అన్నారు, బుధవారం సాయంత్రం మండలంలోని బలిసింగాయ పల్లి లో ఆయన జగనన్న ఎందుకు కావాలంటే కార్యక్రమంలో భాగంగా ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు , ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈ నాలుగు మారేళ్ల కాలంలో రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేపట్టడం జరిగిందన్నారు, గతంలో ఎన్నడు లేని విధంగా కులాలకు, మతాలకు , పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు కోట్లాది రూపాయలు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు, ఇంత చేసిన ముఖ్యమంత్రిని మనమందరం ఆశీర్వదించాలని ఆయనను మళ్లీ ముఖ్యమంత్రి చేసుకోవాలని ఆయన కోరారు, అనంతరం సచివాలయం లో ఏర్పాటు చేసిన సంక్షేమ పథకాల సూచిక బోర్డులను గ్రామపంచాయతీ సర్పంచ్ పి. ఈశ్వరమ్మ తో ప్రారంభించారు, అభివృద్ధి, సంక్షేమం తో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలంటే మళ్లీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని దీనికోసం, ప్రతి ఒక్కరు కష్టపడి పని చేసినప్పుడే మళ్లీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగలరని ఆయన తెలిపారు, మీ పరిధిలోని గ్రామాలలోకి వెళ్లి ఈ నాలుగున్నర సంవత్సరం లో మీ గ్రామాలలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన తెలిపారు, ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ రఘురాం రెడ్డి, మాజీ సర్పంచ్ కృష్ణారెడ్డి, వైయస్సార్సీపి మహిళ నాయకురాలు భాగ్యమ్మ, లేవాకు ఈశ్వర్ రెడ్డి, వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ జీఎన్ భాస్కర్ రెడ్డి, ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్, వైఎస్ఆర్సిపి టౌన్ కన్వీనర్ ముదిరెడ్డి సుబ్బారెడ్డి, , ఎంపీటీసీలు, నిరంజన్ రెడ్డి, , సొసైటీ అధ్యక్షులు , సాధిక్ అలీ, వారిష్, హస్రత్, సాదు కిషోర్, సిద్ధవటం హరి, చంద్ర, సర్పంచులు ,ఎంపీటీసీలు, వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

About Author