NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జగనన్న ప్రభుత్వాన్ని దీవించండి..

1 min read

కర్నూలు ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్​ఖాన్​

పల్లెవెలుగు:సంక్షేమం..అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్న సీఎం వైఎస్​ జగన్​మోహన్​ రెడ్డిని మరోసారి ఆశీర్వదించాలని కోరారు కర్నూలు ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్​ఖాన్​. శుక్రవారం నగరంలోని 13వ వార్డు పరిధిలోని 31వ సచివాలయం బంగారుపేటలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు.  ఈ సందర్భంగా ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు .ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను అర్హత కలిగిన ప్రతిఒక్కరికి అందేలా చూడాలని సంబంధిత సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో స్థానిక వార్డ్ కార్పొరేటర్ విజయలక్ష్మి గారు,స్థానిక వైఎస్సార్ సీపీ ముఖ్యనాయకులు,కార్యకర్తలు,సచివాలయ సిబ్బంది,మున్సిపాలిటీ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, ఆర్.పి లు సంబందిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

About Author