PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అరికాళ్ల పై బొబ్బ‌లు వ‌చ్చినా ఆగ‌దు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : భారత్‌ జోడో యాత్రికుల అరికాళ్లపై బొబ్బలు వచ్చినా యాత్ర కొనసాగుతుందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. కేరళలో మూడో రోజు యాత్రకు జనం భారీగా పోటెత్తారు. సోమవారం రాత్రే యాత్ర 100 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. మంగళవారం కషక్కూట్టంలోని కనియాపురం నుంచి అట్టింగల్‌ వరకు కొనసాగించి విరామం తీసుకున్నారు. సాయంత్రం తిరిగి అట్టింగల్‌లో పునఃప్రారంభించి కల్లంబలం జంక్షన్‌ వరకు యాత్ర కొనసాగించారు. మధ్యమధ్యలో వర్షం కురుస్తున్నా గొడుగులు లేకుండానే యాత్రను కొనసాగించారు. ప్రజలూ వర్షాన్ని లెక్కచేయకుండా రాహుల్‌ను చూసేందుకు పెద్దసంఖ్యలో రోడ్లకు ఇరువైపులా బారులు తీరారు. ‘దేశాన్ని సమైక్యం చేసేందుకు బయలుదేరాం. అరికాళ్లపై బొబ్బలు వచ్చినప్పటికీ యాత్ర ఆగదు’ అని ఫేస్‌బుక్‌ పోస్టులో రాహుల్‌ పేర్కొన్నారు.

                                     

About Author