PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పోలీసుల అమరవీరుల దినోత్సవంలో రక్తదానం

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసుల అమరవీరులకు పోలీసులు మరియు ప్రజా ప్రతినిధులు నాయకులు జోహార్ అంటూ నివాళులు అర్పించారు. శనివారం రోజున పోలీసుల అమరవీరుల దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆత్మకూరు డిఎస్పీ ఏ.శ్రీనివాసరావు ప్రారంభించారు.మిడుతూరు ఎస్సై ఎం.జగన్ మోహన్ అధ్యక్షతన జరిగిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు రక్తాన్ని స్వీకరించారు.జడ్పిటిసి పర్వత యుగంధర్ రెడ్డి,ఎస్ఐ ఎం.జగన్ మోహన్,వైసీపీ మండల కన్వీనర్ తువ్వా లోకేశ్వర రెడ్డి,జిల్లా పార్టీ కార్యనిర్వాహక సభ్యులు ఇనాయతుల్ల,డాక్టర్ వనజ,టిడిపి మండల కన్వీనర్ కాత రమేష్ రెడ్డి,సుభాన్,యరభం ప్రమోద్ రెడ్డి,చౌటుకూరు సచివాలయ కన్వీనర్ సాధిక్,జనసేన పార్టీ మండల నాయకులు ప్రభాకర్ మరియు పోలీసులు,యువకులు పార్టీలకతీతంగా రక్తదానం చేశారు.రక్తదానం చేసిన వారందరికీ డీఎస్పీ ప్రశంసా పత్రాలను అందజేశారు.ఈ కార్యక్రమంలోపట్టణ మరియు రూరల్ సిఐలు,సర్కిల్ లోని ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

About Author