PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

లయన్స్ క్లబ్ టౌన్ ఆధ్వర్యంలో రక్తదానం

1 min read

పల్లెవెలుగు వెబ్​, రాయచోటి: రాయచోటి లయన్స్ క్లబ్ టౌన్ నూతన అధ్యక్షులు లయన్ చాన్ బాషా పుట్టిన రోజు సందర్భంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి లో రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి లయన్​ అధ్యక్షులు నాగార్జున ఆచారి, డీఎస్పీ వాసుదేవన్​, చిన్న పిల్లల వైద్యులు బయరెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. కరోన విపత్కర సమయంలో రక్తదానం చేసే వారు కరువయ్యారని, చాన్​ బాష జన్మదినం సందర్భంగా రక్తదానం కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం ప్రముఖ వైద్యులు బయ రెడ్డి మాట్లాడుతూ రక్తం ఇస్తే.. బలహీనులు అవుతారని అలాంటి మాటలు పట్టించుకోకుండా ధైర్యంగా రక్తం ఇవ్వాలని సూచించారు. వ్యవస్థాపక అధ్యక్షులు లయన్ హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ నేను ఇప్పటివరకు 14 సార్లు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తం ఇచ్చానని అందులో భాగంగా రక్తం కొరత ఉన్న సమయంలో నేను అందులో ఒక్కడినైనందుకు సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు మహేశ్వర్ రాజు, కోశాధికారి లయన్ విజయ్ కుమార్,రక్తం సేకరించే సిబ్బంది, ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

About Author