PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కొండెక్కిన కోడిగుడ్డు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : కోడిగుడ్డు ధర కొండెక్కింది. వ్యాధి నిరోధక శక్తి పెరిగేందుకు గుడ్డు తినాలని వైద్యులు సూచించడంతో రెండేళ్లుగా వినియోగం పెరిగింది. డిమాండ్‌ పెరగడం, ఉత్పత్తి తగ్గడంతో కొంతమేర దిగుమతి తగ్గింది. దీంతో 30 గుడ్ల ట్రే రూ.120నుంచి రూ.180కి పెరిగింది. కోడిగుడ్ల ధర అమాంతం పెరిగిపోయింది. పదిరోజుల వ్యవధిలో గుడ్డుపై రూ.1.50 పెరిగింది. 30 గుడ్ల ట్రే పదిరోజుల క్రితం రూ.120 ఉండగా ప్రస్తుతం హోల్‌సేల్‌ దుకాణాల్లోనే రూ.160 నుంచి రూ.180వరకు విక్రయిస్తున్నారు. ఇక చిల్లర దుకాణాల్లో అయితే విడిగా రూ.7కు విక్రయిస్తున్నారు.

                                     

About Author