PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అభయములోసగే వరప్రధాత బొజ్జగణపయ్య

1 min read

– మాజీ జెడ్పీ చైర్మన్ సుగవాసి బాలసుబ్రమణ్యం

పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా బ్యూరో: అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి పట్టణంలోని రాజు ఒలంపియాడ్ పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బొజ్జ గణపతి విగ్రహం వద్ద మంగళవారం చమర్తి మహేష్ రాజు  ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికిముఖ్యఅతిథిలుగా  మాజీ జడ్పీ చైర్మన్ సుగవాసి బాలసుబ్రమణ్యం.మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు హాజరైనారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భక్తాదులకు వరములుఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భక్తాదులకు వరములు సకే  వరప్రదాత బజ్జ గణపయ్యేనని పేర్కొన్నారు. భక్తిశ్రద్ధలతో వినాయకుడి విగ్రహం వద్ద అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.అదేవిధంగా వినాయకుడి విగ్రహాల వద్ద సాంస్కృతిక కార్యక్రమాలుఆర్కెస్ట్రా మరియు సాసవల చిన్నమ్మ కథ తదితర కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ భక్తాదులు తమ భక్తిని చాటుకోవడం శుభ పరిణామం అన్నారు.వినాయక చవితి పండుగను పురస్కరించుకుని వాడవాడలా వెలసిన బొజ్జ గణపతి విగ్రహాల వద్ద భక్తాదులు ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి తమ భక్తిని చాటుకుంటున్నారన్నారు.ఈ కార్యక్రమంలో వినాయకుని ఉత్సవ కమిటీ సభ్యులు ,టిడిపి కార్యకర్తలు భక్తాదులు తదితరులు పాల్గొన్నారు.

About Author