NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆర్ఎస్ఎస్ కార్యాల‌యం పై బాంబు దాడి

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : కేరళ పయ్యనూర్‌లోని రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ కార్యాలయంపై మంగళవారం తెల్లవారుజామున ఇద్దరు దుండగులు బాంబు విసిరారు. దీంతో భవనం ప్రధాన ద్వారం తలుపులు, కిటికీలు ధ్వంసమయ్యాయి. బాంబు దాడి దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి. ధ్వంసమైన తలుపులు, కుర్చీలు, టేబుళ్ల ఫోటోలు, బాంబు దాడి వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. దాడికి కొద్ది సమయం ముందు ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై వచ్చి ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యాలయాన్ని పరిశీలించినట్లు సీసీటీవీలో నమోదైంది.

                                         

About Author