PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అజిత్ `వ‌లిమై` థియేట‌ర్ పై బాంబు దాడి !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : కోలీవుడ్‌ స్టార్‌ అజిత్‌ హీరోగా, టాలీవుడ్‌ హీరో కార్తికేయ విలన్‌గా నటించిన తాజా చిత్రం వలిమై. ఈ సినిమా గురువారం థియేటర్లలో రిలీజైంది. కోయంబత్తూరులోని గంగవల్లి మల్టీప్లెక్స్‌ థియేటర్‌ ముందు పెట్రోల్‌ బాంబ్‌ దాడి జరిగింది. బైక్‌పై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు వలిమై సినిమా నడుస్తున్న థియేటర్‌ ఎదుట బాంబుతో దాడి చేశారు. అక్కడే ఉన్న అభిమానులు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా వారు బైక్‌పై పరారయ్యారు. ఈ దాడిలో ఎవరూ గాయపడలేదు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగులను పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు.

                                        

About Author