PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విమానానికి బాంబు బెదిరింపు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: ఇరాన్ రాజధాని టెహ్రాన్ నుంచి చైనాలోని గ్వాంగ్ జౌ వెళుతున్న విమానం భారత్ గగనతలంలోకి ప్రవేశించిన సమయంలో బాంబు బెదిరింపు ఎదుర్కొంది. దాంతో భారత్ లో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఆ సమయంలో ఇరాన్ విమానం ఢిల్లీకి చేరువలో ఉంది. తమ విమానానికి బాంబు బెదిరింపు వచ్చిందంటూ ఆ విమాన పైలెట్ ఢిల్లీ ఎయిర్ పోర్టు అధికారులను ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు అనుమతి కోరాడు. అయితే, అధికారులు ఆ విమానాన్ని జైపూర్ ఎయిర్ పోర్టుకు వెళ్లాలని సూచించారు. అటు, భారత వాయుసేన కూడా వెంటనే స్పందించి ఆ విమానానికి రక్షణగా రెండు యుద్ధ విమానాలను కూడా రంగంలోకి దింపింది. అయితే ఆ ఇరాన్ విమాన పైలెట్ జైపూర్ లో ల్యాండింగ్ చేయకుండా, భారత గగనతలాన్ని వీడి ప్రయాణాన్ని కొనసాగించాడు. కాగా, ఆ విమానాన్ని ఓ ఫ్లయిట్ ట్రాకింగ్ వెబ్ సైట్ ట్రాక్ చేయగా, చైనా గగనతలంలో ఉన్నట్టు వెల్లడైంది.

                                                  

About Author