PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

డ‌బ్బులు లేకుండా ట్రైన్ టికెట్ ఇలా బుక్ చేసుకోండి !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప‌్ర‌ముఖ ఫిన్ టెక్ సంస్థ పేటీఎమ్ బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. చేతిలో డ‌బ్బు లేక‌పోయినా ట్రైన్ టికెట్ బుక్ చేసుకుని స‌దుపాయం క‌ల్పించింది. బుక్ చేసుకున్న ట్రైన్ టికెట్ డ‌బ్బుల్ని పేటీఎం నిర్దేశించిన స‌మ‌యంలోపు చెల్లించాలి. పేటీఎం సంస్థ ఐఆర్‌సీటీసీ భాగస్వామ్యంతో ‘బై నౌవ్‌, పే లేటర్‌స‌ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్‌ సాయంతో పేటీఎంలో డబ్బులు లేకుండా వన్‌ క్లిక్‌తో ట్రైన్‌ టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు. ట్రైన్‌ టికెట్ల నుంచి నిత్యవసర వస్తువుల వరకు.. నిత్యవసర వస్తువుల నుంచి షాపింగ్‌ వరకు డబ్బులు లేకుండానే మనకు నచ్చిన వస్తువుల్ని కొనుగోలు చేయోచ్చు. ఇందుకోసం పేటీఎం ఎటువంటి వడ్డీ లేకుండా రూ.60వేల వరకు ఆఫర్‌ చేస్తుంది. ఇక ఖర్చు చేసిన మొత్తాన్ని 30రోజుల లోపు చెల్లించాల్సి ఉంటుంది. ఎంపిక చేసిన కస్టమర్లకు ఈఎంఐ సౌకర్యం అందిస్తామని పేటీఎం పేమెంట్‌ సర్వీస్‌ సీఈఓ ప్రవీణ్‌ శర్మ తెలిపారు.

                                                

About Author