PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విజృంభించిన టీమ్ ఇండియా

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: తిరువనంతపురం గ్రీన్ ఫీల్డ్ స్టేడియంలో పిచ్ పేరుకు తగ్గట్టే పచ్చికతో పచ్చగా కనిపిస్తోంది. దాంతో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియాకు బౌలర్లు అద్భుతం అనదగ్గ ఆరంభాన్నిచ్చారు. అర్షదీప్ సింగ్ 3 వికెట్లు తీయగా, దీపక్ చహర్ 2 వికెట్లతో దక్షిణాఫ్రికాను దెబ్బతీశారు. దాంతో దక్షిణాఫ్రికా జట్టు 9 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే సఫారీ కెప్టెన్ టెంబా బవుమా (0)ను డకౌట్ చేయడం ద్వారా చహర్ దక్షిణాఫ్రికా వికెట్ల పతనానికి శ్రీకారం చుట్టాడు. ఆ తర్వాత అర్షదీప్ ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీయడంతో సఫారీలు విలవిల్లాడారు.

                                   

About Author