PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విజృంభించిన టీమిండియా !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో భారత్‌ జూలు విదిల్చింది. బౌలింగ్‌, బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌ విభాగాల్లో చెలరేగి పర్యాటక దక్షిణాఫ్రికాను కట్టడి చేసింది. పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ (3/38) అద్భుత బౌలింగ్‌కు తోడు శ్రేయాస్‌ అయ్యర్‌ (111 బంతుల్లో 15 ఫోర్లతో 113 నాటౌట్‌) అజేయ శతకం, ఇషాన్‌ కిషన్‌ (84 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 93) భారీ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నారు. దీంతో ఆదివారం జరిగిన రెండో వన్డేలో భారత్‌ ఏడు వికెట్లతో గెలిచింది. తద్వారా మూడు వన్డేల సిరీ్‌సలో 1-1తో సమంగా నిలిచింది. ముందుగా దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 7 వికెట్లకు 278 పరుగులు సాధించింది. మార్‌క్రమ్‌ (79), హెన్‌డ్రిక్స్‌ (74) అర్ధసెంచరీలతో ఆదుకున్నారు. ఛేదనలో భారత్‌ 45.5 ఓవర్లలో 3 వికెట్లకు 282 పరుగులు చేసి గెలిచింది. శుభ్‌మన్‌ గిల్‌ (28), సంజూ శాంసన్‌ (30 నాటౌట్‌) ఫర్వాలేదనిపించారు. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా శ్రేయాస్‌ నిలిచాడు.

                                      

About Author