PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రెండు పార్టీలను ఇంటికి పంపించాల్సిందే

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  ప్రజా సమస్యలను వదిలేసి సామాన్య ప్రజలకు మౌలిక వసతులు కూడా కల్పించకుండా, సామాన్యులు ఎదగకుండా దశాబ్దాలుగా మన రాష్ట్రాన్ని ఏలుతున్న కుటుంబాలను, కుటుంబ పార్టీలను ఇంటికి పంపించాల్సిందేనని అశోక్ నగర ప్రాంత ప్రజలు నిస్సంకోచంగా చెప్పారు. జయహో ప్రజా పలకరింపు యాత్ర సందర్భంగా జాతీయ సమ సమాజం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు రామయ్య యాదవ్ చేస్తున్న ప్రయత్నానికి మా మద్దతు ఉంటుందని, స్వార్థ రాజకీయ నాయకులను, ఆదిపత్య భావజాలాన్ని ఇక సహించబోమని ప్రజా పలకరింపు యాత్రలో స్వచ్ఛందంగా  పాల్గొన్న మేధావులు, ఉద్యోగులు, యువత తమ సంఘీభావాన్ని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జె ఎస్ ఎస్ పి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు రామయ్య యాదవ్ తో పాటు పాల్గొన్నారు.

About Author