PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇరు పార్టీలు కలిసి సీఎం అభ్యర్థిని ప్రకటిస్తాం !

1 min read

పల్లెవెలుగువెబ్ : వచ్చే సాధారణ ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి పోటీచేస్తాయని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు తెలిపారు. రెండు పార్టీల పెద్దలు చర్చించుకుని సీఎం అభ్యర్థిని ప్రకటిస్తారని తెలిపారు. టీడీపీ, వైసీపీతో సమానం దూరం ఉండాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిశా నిర్దేశం చేశారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పీఆర్‌సీ జీవోను వెంటనే రద్దుచేయాలని, ఉద్యోగులను మళ్లీ చర్చలకు పిలిచి సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఉద్యోగుల పక్షాన బీజేపీ పోరాడుతుందని, వారి ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఇస్తుందని చెప్పారు. ఎస్‌డీపీఐ నేత అతావుల్లాను అరెస్ట్‌ చేయాలని, రాష్ట్రంలో ఎస్‌డీపీఐని నిషేధించాలని డిమాండ్‌ చేశారు.

            

About Author