PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

8న ’బ్రాహ్మణ’ మహిళలకు ఘనసన్మానం

1 min read

బ్రాహ్మణ సేవ సంక్షేమ మిత్రమండలి అధ్యక్షుడు  సండేల్​చంద్రశేఖర్​

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా ఈనెల 8న విద్యావంతులు, ఉద్యోగులు..స్వాతంత్ర పోరాట యోదులైన బ్రాహ్మణ మహిళలను ఘనంగా సన్మానించనున్నట్లు వెల్లడించారు బ్రాహ్మణ సేవ సంక్షేమ మిత్రమండలి అధ్యక్షుడు  సండేల్​చంద్రశేఖర్.​ శుక్రవారం కర్నూలు నగరంలోని దేవి ఫంక్షన్​ హాల్​లో బ్రాహ్మణ సేవ సంక్షేమ మిత్రమండలి, గాయత్రి బ్రాహ్మణ సంఘం సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సండే చంద్రశేఖర్​ మాట్లాడుతూ మహిళలను గౌరవించడం అందరి బాధ్యత అన్నారు. సామాజికంగా.. ఆర్థికంగా.. రాజకీయంగా, ఉద్యోగపరంగా రాణిస్తూ.. ఎందరికో స్ఫూర్తిగా నిలిచే బ్రాహ్మణ వీరవనితలను సగౌరవంగా సన్మానిస్తామని ఈ సందర్భంగా  సండేల్​ చంద్రశేఖర్​ పేర్కొన్నారు. అనంతరం గాయత్రి బ్రాహ్మణ సంఘం ఉపాధ్యక్షుడు, పసుపుల గ్రామ ఎంపీటీసీ మురళీకృష్ణ మాట్లాడుతూ ఝాన్సీలక్ష్మీభాయి, ఇందిరాగాంధీ, సరోజిని నాయుడు, ప్రతిభాపాటిల్​​ వంటి బ్రాహ్మణ వీరవనితలు.. ఎందరికో స్ఫూర్తిగా నిలిచారన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని ఈ నెల 8న (సాయంత్రం 5 గంటలకు) నగరంలోని నంద్యాల చెక్​ పోస్టు దగ్గరున్న దేవి ఫంక్షన్​ హాల్​లో బ్రాహ్మణ సేవ సంక్షేమ మిత్రమండలి, గాయత్రి బ్రహ్మణ సంఘం నేతృత్వంలో బ్రాహ్మణ వీరవనితలను సన్మానిస్తామని, ఈ కార్యక్రమానికి మహిళలు పెద్ద సంఖ్యలో విచ్చేయాలని పసుపుల ఎంపీటీసీ మురళీకృష్ణ కోరారు. సమావేశంలో గాయత్రి బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు కొలుకుల చంద్రశేఖర్​, గాయత్రి బ్రాహ్మణ సంఘం సెక్రటరి కంచుగుంటల శ్యామ్​ సుందర్​ శర్మ, బ్రాహ్మణ సేవ సంక్షేమ మిత్ర మండలి కోశాధికారి నాగులవరం రాజశేఖర్​, ఈసీ మెంబర్లు శ్రీనివాసరాజు, చల్లా నాగరాజు శర్మ, ఎ.రాధాకృష్ణ, సీఎస్​ ప్రసాద్​, ఆర్​. సుధాకర్​ తదితరులు ఉన్నారు.

About Author