PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చక్రస్నానం తో వైభవం గా బ్రహ్మోత్సవాలు ముగింపు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  స్థానిక సంకల్ బాగ్ హరిహర క్షేత్రం లో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి 18 వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ రోజు చక్ర స్నానం తో ముగిసాయి.చక్రస్నానం సమయం లో గరుడ పక్షులు ఆకాశం లో విహరించడం తో భక్తులు ఆనంద సంబ్రమాశ్చర్యం కు గురి అయ్యారు.సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలిగినట్లు దర్శనం చేసుకొన్నారు. చక్రస్నానం కార్యక్రమాన్ని మాజీ రాజ్యసభ సభ్యులు శ్రీ టీ.జీ. వెంకటేష్  వీక్షించి గరుడ పక్షి ని దర్శించుకోవడం జరిగినదని కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు కల్లే చంద్రశేఖర్ శర్మ తెలిపారు. కార్యదర్శి హెచ్. కె. రాజశేఖర్ రావు, గౌరవ సలహాదారులు హెచ్ కె మనోహర్ రావు, కేజీ ప్రభాకరరావు, శివరామ ప్రసాద్, బాలసత్యనారాయణ, కె.వి. సుబ్బారావు, సుదర్శన్, సూర్యనారాయణ, వాయుసేన సేవాదళ్, మహిళా సేవాదళ్  పెద్ద సంఖ్య లో భక్తులు పాల్గొన్నారు.

About Author